టీఆర్ఎస్ ప్లీనరీ ( TRS pleanary ) సమావేశాలు అయిపోయిన తర్వాత జీఎహెచ్ఎంసీ ( GHMC ) అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని హైటెక్స్లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సంధర్బంగా నగర వ్యాప్తంగా పార్టీకి చెందిన వారితో పాటు నగరంలోని మంత్రుల పేరుతో ఫ్లేక్సీలు వెలిశాయి. దీంతో కాంగ్రేస్తో పాటు పలువరు పార్టీ ఫ్లెక్సీలపై ఫిర్యాదు ( complaint ) చేశారు. దీంతో ఫ్లెక్సీల ఏర్పాటుపై దుమారం రేగింది. ఈ క్రమంలోనే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ స్పందించింది. గత కొన్ని రోజుల నుంచి సెంట్రల్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణంగా ఫైన్లను నిలిపేసిన అధికారులు.. నేటి నుంచి మళ్లీ ఫైన్లను వేయడం ప్రారంభించారు. ప్లీనరీ సందర్భంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కటౌట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్కు జీహెచ్ఎంసీ 30 వేల రూపాయల ఫైన్ విధించింది. అదేవిధంగా మంత్రి తలసానికి 5 వేల రూపాయల ఫైన్ విధించింది. అయితే ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగానే స్పందించకుండా.. అంతా అయిపోయాక, తూతూ మంత్రంగా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ చలాన్లు విధించిందని పలు విమర్శలు వస్తున్నాయి.