Operation Parivartan: దేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి, డ్రగ్స్ పట్టుబడినా దానికి మూలం ఏపీ పేరే వినిపిస్తుండటం, విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి రవాణా విపరీతంగా జరుగుతుండటంతో.. ఈ వ్యవహారాన్ని ఏపీ సర్కార్ సీరియస్గా తీసుకుంది. గంజాయి సాగు, స్మగ్లింగ్ను అరికట్టేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుతవం. గంజాయి కనిపిస్తే చాలు కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు.. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గంజాయిని ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. గంజాయి తోటల ధ్వంసాన్ని గిరిజనులు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బుధవారం నాడు విశాఖపట్నంలోని జి.మాడుగుల మండలం బొయితిలి పరిసర ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారని సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లారు.