చిత్తూరు: రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడిన రోజా క్రీడాకారుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. కాగా, నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.