ఏపీ పీజీసెట్ ఫలితాలను విద్యాశాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి హాజరయ్యారు. తొలిసారి అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఒకే పీజీ సెట్ నిర్వహించింది.