CM KCR: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు చివరి అంకానికి చేరుకుంది. ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా, గవర్నర్ కోటాలో అభ్యర్థులను పార్టీ అధినేత కేసీఆర్ ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక వర్గాలు, జిల్లాలు, ఉద్యమకారులు అన్నింటిని భేరీజు వేసి ఫైనల్ లిస్టు తయారుచేస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల నామినేషన్ లకు మంగళవారం చివరిరోజు కావటంతో ఆదివారం రోజు అభ్యర్థుల ప్రకటించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న 19 ఎమ్మెల్సీ పదవులకు అభ్యర్థుల ఎంపిక చివరి స్టేజీకి చేరుకున్నది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 19 సీట్లకు వంద మంది వరకు ఆశావహులు ఉండటంతో ఆచితూచి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. జిల్లాలు, సామాజిక వర్గాలు, సీనియారిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని అవకాశాలుంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.