Pollution Certificate: వాయు కాలుష్యం మరింతగా పెరిగిపోతోంది. దీపావళి పండగ తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా పరిస్థితి మరింతదారుణంగా తయారైంది. ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్య స్థాయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వాయు కాలుష్యం కారణంగా గొంతు మంట, కళ్లల్లో నుంచి నీళ్లు రావడం తదితర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి కాలుష్యాన్ని నియంత్రించేలా చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అనవసరమైన నిర్మాణాలను నిలిపివేయడం, రవాణా, పవర్ ప్లాంట్లను నిలిపివేయడం వంటి చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు సూచించింది. అలాగే వాయు కాలుష్యాన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం.. వాహనాల పీయూసీ సర్టిఫికేట్లపై నిబంధనలు మరింత కఠినతరం చేసింది. పోల్యూషన్ సర్టిఫికేట్ లేకుండా పట్టుబడితే వాహన యజమానికి ఆరు నెలల జైలు శిక్షల ఏదా రూ.10,000 జరిమానా లేదా రెండు విధించవచ్చు.