ఏపీకి ఇంకా వర్ష ముప్పు వీడలేదని వాతావరణ శాఖ తెలిపింది. ఎందుకంటే..తమిళనాడులో వాయుగుండం బలహీనపడింది. ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్నాటక ప్రాంతాల్లో.. ఈ వాయుగుండం అల్పపీడనంగా మారింది దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో మోస్తారు వర్షాలు పడనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అటు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ 4 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.