Central Cabinet Meeting Highlights: కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు తీపి కబురు అందించారు. అలాగే దేశంలో మెగా టెక్స్టైల్ పార్కుల విషయంలోనూ ముందడుగు వేసింది కేంద్రం. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగుల విషయంలో కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని ఈ ఏడాది ఉత్పాదకత ఆధారిత బోనస్గా ఇవ్వాలని నిర్ణయించింది కేంద్రం. ఈ నిర్ణయం వల్ల 11 లక్షల 56 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాపై 1985 కోట్ల మేర భారం పడనుంది.
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు బోనస్తో పాటు పలు అంశాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా 7 మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్కుల ఏర్పాటుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాబోయే ఐదేళ్లలో 4 వేల 445 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తారు. ఈ నిర్ణయంతో 7 లక్షల మందికి ప్రత్యక్షంగాను.. 14 లక్షల మందికి పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.