ఎంవిపి కాలనీ : క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా జివిఎంసి పరిధిలోని 98 వార్డులల్లో వ్యర్థాలను తరలించే 290 వాహనాలను మొదటి విడతగా రాజ్యసభ సభ్యలు విజయసాయిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నదే జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ తదితరులు పాల్గొన్నారు.