సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిట్టాపూర్, భూంపల్లి గ్రామాల మధ్యలో.. రోడ్డుపక్కన ఉన్న ఒక వ్యవసాయ బావిలో కారు అదుపుతప్పి పడిపోయింది. కాగా, రామాయణ్ పేట నుంచి సిద్ధిపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఫైరింజన్ అధికారులతో సహయంతో.. నీటిని తోడుతున్నారు.