Hyderabad: సైబర్ నేరగాళ్ల (Cyber Frauds) ఆగడాలు కొత్త పుంతలు తొక్కతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వేర్వేరు మార్గాల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) నగరానికి చెందిన వరప్రసాద్ కంపెనీ ఈ-మెయిల్ ను హ్యాక్ చేశారు సైబర్ దొంగలు. మొత్తం రూ.46 లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని సంతోష్ నగరానికి చెందిన వరప్రసాద్ సెన్సార్ కేర్ మెడికల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మెడికల్ పరికరాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. విదేశాల నుంచి వాటిని కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నాడు.