గాజువాక:జివిఎంసి 87వ వార్డులో ఉన్న గెడ్డలకు రీటైనింగ్ వాల్స్ నిర్మించుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీ శా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తిరుమల నగర్, వడ్లపూడి, ఆర్హెచ్ కాలనీ, తిలకవీధి తదితర ప్రాంతాలలో వార్డు కార్పొరేటర్ బొండా జగన్నాధంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వచ్చ సర్వేక్షన్ ర్యాలీలో పాల్గొన్నారు. స్వచ్చ సర్వేక్షన్-2022లో మొదటి ర్యాంకుకు అందరూ కషి చేయాలని, పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య కార్మికులను సర్దుబాటు చేసి పారిశుధ్యాన్ని నిర్మూలించాలన్నారు. వార్డులో కాలువలు, రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని అధికారులని ఆదేశించారు. పిల్లల పార్కులో అభివద్ధి చేస్తున్న సేంద్రీయ ఎరువును పరిశీలించి, ప్లాస్టిక్ బ్యాగులు వాడరాదని సూచించారు. గుడ్డ సంచులను పంపిణీ చేశారు. వార్డులో ఫీవర్ సర్వే చేస్తున్నప్పుడే వ్యాక్షిన్ వేసుకోని వారిని సేకరించి వేయించుకునేలా చూడాలని కార్యదర్శులను ఆదేశించారు. వార్డులో యూజర్ చార్జీలు తక్కువగా వసూలు అవుతున్నాయని వాటి వేగం పెంచాలని ఆదేశించారు. వార్డులో కుక్కలు, పందులను నిర్మూలించాలని పట్టణ ఆరోగ్యపు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్ఎల్ జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీధర్, ఎసిపి రమణమూర్తి, ఎఎంఒహెచ్ డాక్టర్ కిషోర్, సహాయక ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.